శభాష్... మోదీ!
Published Thursday, 24 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల చలామణీని రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై భారీగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే దీన్ని భరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఈ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఓపక్క మోదీ నిర్ణయం వల్ల పేదలు తీవ్ర స్థాయిలో యాతనలు పడుతున్నారని, సమయానికి డబ్బులు అందక మరణాలూ సంభవిస్తున్నాయంటూ విపక్షాలు ముక్తకంఠంతో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో ‘మీరే చెప్పండి’ అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు భారీగానే స్పందించారు.