మత్స్యకారులను ఆదుకోవాలి: ఎంపి
Published Tuesday, 22 November 2016శ్రీకాకుళం, నవంబర్ 22: రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా తడ నుంచి ఇచ్ఛాపురం వరకు సువిశాల తీరం వెంబడి వేటే జీవనాధారంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న మత్స్యకారులను ఆదుకునే కార్యక్రమాలు అమలు చేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్కి వినతిపత్రం అందించారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం ఎంపి రామ్మోహన్నాయుడు వెళ్లి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల స్థితిగతులను వివరించారు.