ప్రభుత్వ ఆయుర్వేద డిగ్రీ కళాశాలలో సీట్ల పెంపు
Published Tuesday, 22 November 2016విజయవాడ, నవంబర్ 22: ఐదు దశాబ్దాలుగా కష్టాలను ఎదుర్కొంటున్న స్థానిక డాక్టర్ నోరి రామశాస్ర్తీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు మహర్దశ పట్టింది. సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కారణంగా ఇటీవల వరుసగా రెండేళ్లపాటు డిగ్రీ, పిజి కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపేశారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కృషితో అడ్మిషన్లను పునరుద్ధరించారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్ సభ్యులు ఇప్పటికి పలుమార్లు కళాశాలను సందర్శించి అనేక సూచనలు ఇచ్చారు.