విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలి
Published Wednesday, 23 November 2016గుంటూరు, నవంబర్ 22: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో రాణించాలని సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక పోలీసు పెరెడ్గ్రౌండ్లో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగస్వాములై సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో దేన్నైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు.