భారత సైన్యానికి స్వర్ణ పతకం
Published Sunday, 23 October 2016న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరులోనే కాదు, అంతర్జాతీయ పోటీల్లోను తమకు తామే సాటి అని భారత సైన్యం నిరూపించుకుంది. సైన్యంలోని గూర్ఖా రైఫిల్స్ దళం అత్యంత కఠినమైన కాంబ్రియన్ పెట్రోలింగ్ ఎక్సర్సైజెస్లో స్వర్ణ పతకం సాధించింది. వేల్స్లోని బ్రిటిష్ సైన్యం ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంది. 8వ గూర్ఖా రైఫిల్స్ రెండో బెటాలియన్కు చెందిన 8 మంది సభ్యుల బృందానికి పతకాలను ప్రదానం చేస్తున్న చిత్రాలను బ్రిటిష్ ఆర్మీ ట్వీట్ చేసింది. ‘కాంబ్రియన్ పెట్రోల్లో స్వర్ణ పతకం గెల్చుకున్న గూర్ఖా రైఫిల్స్ బృందానికి అభినందనలు..