ప్రభుత్వం మెడలు వంచుతాం
Published Saturday, 22 October 2016హైదరాబాద్, అక్టోబర్ 21: ‘ప్రభుత్వం మెడలు వంచుతాం... ఫీజు రీయంబర్స్మెంట్ వసూలు చేసి, విద్యార్థులకు న్యాయం చేస్తాం..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్మెంట్పై కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పోరాట బాట పట్టింది. శంషాబాద్లో ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎఐసిసి కార్యదర్శి ఆర్సి కుంతియా, ఎఐసిసి ఎస్సి విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభించారు.