రూ.25 లక్షల పరిహారం చెల్లించండి
Published Thursday, 29 September 2016న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ఎడమ కాలికి 40 శాతం వైకల్యాన్ని పొంది బాధపడుతున్న ఒక రోగికి రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఒక ప్రైవేటు ఆసుపత్రిని, అందులో పనిచేస్తున్న ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. లలిత్ సయాల్ అనే రోగికి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్-3లో గల సుందర్లాల్ జైన్ ఆసుపత్రిని, రూ. అయిదు లక్షల చొప్పున చెల్లించాలని చికిత్స చేసిన ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ప్రెసిడెంట్ జస్టిస్ వీణా బిర్దాల్, సభ్యుడు సల్మా నూర్తో కూడిన బెంచ్ ఆదేశించింది.