ఎత్తిపోతల ద్వారా 2.34 లక్షల ఎకరాలకు నీరు
Published Thursday, 29 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 28: చిన్న తరహా ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది 2 లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడిసి) అధికారులను ఆ శాఖ మంత్రి టి హరీశ్రావు ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో బుధవారం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. టిఎస్పి పథకం కింద కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రూ. 18 కోట్ల వ్యయంతో చేపట్టిన 55 ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.