బిసి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
Published Friday, 23 September 2016విజయవాడ, సెప్టెంబర్ 22: బిసిల్లో వేల మందిని యువ పారిశ్రామికవేత్తలుగా తయారుచేయటానికి 25 లక్షల రూపాయలతో చిన్న యూనిట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పిస్తున్నట్లు బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సంచార జాతులకు చెందిన 26 కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సాధికార సర్వే పూర్తిచేసిన తరువాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10వేల రూపాయలు లబ్ధి అందే విధంగా కృషి చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.