అలుగులు పారుతున్న చెరువులు
Published Friday, 23 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మిషన్ కాకతీయ కింద చేపట్టిన పలు చెరువులు నీటితో నిండుకుండల్లాగా కనిపిస్తున్నాయి. మొదటి దశలో మిషన్ కాకతీయ కింద చేపట్టిన దాదాపు అన్ని చెరువుల్లో నీరు నిండి అలుగు పొర్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2321 చెరువులు ఉండగా, వీటిలో 1239 చెరువులు అలుగు పోస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5939 చెరువులకు గాను 400 చెరువులు నిండు కుండలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 5550 చెరువులకు గాను 1129 చెరువులు, ఖమ్మం జిల్లాలో 4517 చెరువులకు గాను 443 చెరువులు అలుగు పోస్తున్నాయి.