నినాదాలు, ప్రసంగాలతో దద్దరిల్లిన వికారాబాద్
Published Tuesday, 20 September 2016వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ, రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటావార్పు, ప్రభుత్వానికి, సిఎం, మంత్రులకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు, నాయకుల ప్రసంగాలతో సోమవారం వికారాబాద్ దద్దరిల్లిపోయింది. పట్టణ నలుదిక్కులా ఆందోళనలే కనిపించారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ఆమరణ, రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయగా, రోడ్ ఓవర్బ్రిడ్జిపై యువజన కాంగ్రెస్, వైఎస్ఆర్సిపిల రాస్తారోకో, ధర్నా, కొత్తగడి వద్ద వంటవార్పు, పట్టణంలో బంద్తో జనజీవన స్తంభించిపోయింది.