పెండ్యాలకు సంఘీభావం తెలిపిన తపస్, టియుటిఎఫ్
Published Tuesday, 20 September 2016వికారాబాద్, సెప్టెంబర్ 19: వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటు చేయాలని చేపడుతున్న ఉద్యమానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పూర్తి మద్దతు తెలిపింది. సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పెండ్యాల అనంతయ్యను అఖిలపక్ష దీక్షా శిబిరంలో కలిసి సంఘీభావం ప్రకటించారు.