నినాదాల జోరు
Published Tuesday, 20 September 2016తిరుపతి, సెప్టెంబర్ 19: తాము అన్ని రంగాల్లో వెనుకబడి దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, తమను బిసిలో చేర్చాలంటూ బలిజ కాపునేతలు, అన్నివిధాలా ఎంతో అభివృద్ధిలో ఉన్న బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చి తమ గొంతు కోయొద్దని బిసి సంఘ నేతలు జస్టిస్ మంజునాథ్ కమిషన్కు తమ వాదనలు వినిపిస్తూ వినతిపత్రం సమర్పించారు. కాపులను బిసి కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ రెండురోజలు పర్యటనలో భాగంగా సోమవారం నగర పాలకసంస్థలోని వైఎస్ఆర్ మందిరంలో బహిరంగంగా ప్రజాభిప్రాయాలు సేకరించి వారి వాదనలు ఓపికతో వింది.