దళితులు, గిరిజనులు కమిషన్కు రెండుకళ్లు
Published Tuesday, 20 September 2016చంద్రగిరి, సెప్టెంబర్ 19: దళితులు, గిరిజనులు కమిషన్కు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి అన్నారు. సోమవారం జిల్లా దళిత గిరిజన వేదిక ఆధ్వర్యంలో చంద్రగిరి మండలంలో రాములవారి ఆలయ ఆవరణలో ఆయనకు పౌరసన్మానం చేశారు. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞత తెలుపుతూ ప్రసంగించారు. దళిత విద్యార్థులు విదేశీయ విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్లాన్ ద్వారా చంద్రన్న బాట కింద దళిత గిరిజన కాలనీలో సీసీ రోడ్లునిర్మాణ పనులను పూర్తిచేస్తున్నామన్నారు.