రాష్టస్థ్రాయి తైక్వాండో పోటీలకు రత్నశ్రీ విద్యార్థులు
Published Tuesday, 20 September 2016తెనాలి, సెప్టెంబర్ 19: రాష్ట్ర స్థాయి తైక్వాండో గేమ్స్ పోటీలకు స్థానిక చెంచుపేటలోని రత్నశ్రీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పిఇడి బట్టు నాగరాజు తెలిపారు. ఈనెల 17న ఎస్జిఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపల్లె జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా స్కూల్ తైక్వాండో గేమ్స్ నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో గేమ్స్ పోటీలలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్ -14 విభాగంలో పి గోకుల్, టి నితిన్సాయిలు రజితం, అండర్ -17 విభాగంలో వి హేమంత్కుమార్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించినట్లు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో విజేతలు పోటీపడనున్నట్లు వివరించారు.