S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ

నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 19: జమ్మూ-కాశ్మీర్‌లోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హతులైన భారత సైనికులకు సంఘీభావంగా నెల్లూరు న్యాయవాదులు సోమవారం రాత్రి జిల్లా కోర్టు ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ రోజారెడ్డి, ఉపాధ్యక్షుడు కుడుముల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులతోపాటు బార్ మాజీ జనరల్ సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వీరు జై జవాన్ అని నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు తమ సంతాపాన్ని తెలిపారు.
బిజెపి లీగల్ సెల్ ఖండన

వడ్డెరల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: వడ్డెరల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని అన్నివిధాల అభివృద్ధిపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ఛైర్మెన్ దేవళ్ల మురళి అన్నారు. జిల్లా కేంద్రంలోని రహదారులు, భవనాలు అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-17 ఆర్థిక ఏడాదిలో వడ్డెర సంక్షేమానికి 73.5కోట్ల కేటాయించి అందులో యాభై శాతం రాయితీ కల్పించి రుణం అందజేస్తామన్నారు. గుర్తింపు కలిగిన అన్ని సొసైటీలకు ఆర్థిక సాయం ఇవ్వనున్నామన్నారు.

రగులుతున్న తెలుగుతమ్ముళ్ల అంతర్గత విభేదాలు

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్ల అంతర్గత విభేదాలు రావణ కష్టాంలా రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను సమిసిపోయేటట్లు చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లాపార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు ప్రత్యేక దృష్టిసారించటం లేదన్న ఆరోపణలు పార్టీ నుండే వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుండి, ఇండిపెండెంట్‌గా ఉన్న శాసనసభ్యులు తెలుగుదేశంపార్టీ గూటికి చేరటంతో, గతంలో ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి.

అదనపుకట్నం కోసం భార్యను కిరాతకంగా కాల్చి చంపిన భర్త

గిద్దలూరు, సెప్టెంబర్ 19: అనంతపూర్ జిల్లా గుంతకల్లు సమీపంలోని మద్దికర్రెకు చెందిన బెచ్చపోగుల శాంతిప్రియ (25)ను తన భర్తే ఒంటిపై కిరోసిన్ పోసి కిరాతకంగా కాల్చి చంపిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఇళ్ళలోని ప్రజలు భర్తకు దేహశుద్ధి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు సమీపంలోని మద్దికర్రె గ్రామానికి చెందిన శాంతిప్రియకు కర్నూల్ జిల్లా డోన్ మండపం మల్కాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైల్వేస్టేషన్ మాస్టర్‌కు 2010లో వివాహం జరిగింది. వివాహ సమయంలో శాంతిప్రియ తల్లిదండ్రులు కట్నకానుకల కింద 2లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం ఇచ్చారు.

ఉగ్ర ఘాతుకాన్ని తరిమికొట్టాలి

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 19: ఉగ్ర ఘాతుకాన్ని వెంటనే తరిమికొట్టాలని, ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ సోమవారం రాత్రి బిజెపి ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా బిజెపి అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. నిద్రపోతున్న జవాన్లపై ఉగ్రవాదులు చొరబడి గ్రైనేడ్ లాంచర్ల ద్వారా దాడి జరపటం వలన 17మంది జవాన్లు వీరమరణం పొందారన్నారు.

జిల్లాలో సహజ వనరుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లాలో సహజవనరుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిశ్రమల శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా అవరమైన చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక టిటిడిసిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించే నిమిత్తం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 137 పరిశ్రమలను స్థాపించేలా బ్యాంకర్లతో తక్షణమే సమావేశం ఏర్పాటుచేయాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు.

ప్రత్యేకహోదాపై రాష్ట్రప్రజలను మోసం చేసిన మోదీ

ఒంగోలు, సెప్టెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పదేపదే చెప్పిన దేశ ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసంచేశారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మానస మల్లిక్ ధ్వజమెత్తారు. సోమవారం ఒంగోలులో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుర్రాల రాజ్‌విమల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం భవనం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అవకతవకలపై ఆర్‌జెడికి ఫిర్యాదు

గిద్దలూరు, సెప్టెంబర్ 19: గురుపూజోత్సవ వేడుకల్లో గిద్దలూరు మండలం నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల విభాగంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం పంపిన ప్రతిపాదనలపై ఉపాధ్యాయ వర్గాల్లో దుమారం చెలరేగింది. రాజకీయ ఒత్తిళ్ళ నేపధ్యంలో ప్రతిపాదనల సమర్పణ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కాగా, కొంతమంది ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ విషయమై ఉపాధ్యాయులు ఆర్‌జెడికి ఫిర్యాదు చేశారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

త్రిపురాంతకం, సెప్టెంబర్ 19: మండలంలోని దూపాడు చెరువులోపడి కేశినేనిపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు (35) మృతిచెందిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కేశినేనిపల్లి నుంచి శనివారం రాత్రి నడిగడ్డ గ్రామానికి వెళ్తుండగా చెరువులోపడి ఏడుకొండలు మృతిచెందాడు. సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గొర్రెలకాపరులు గుర్తించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏడుకొండలుగా గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై త్యాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

యద్దనపూడి, సెప్టెంబర్ 19: మండలంలోని గన్నవరం గ్రామంలో ఒక మహిళపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇంకొల్లు సిఐ శ్రీనివాసరావు, ఎస్సై చెంచుప్రసాద్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన పెద్దబ్బాయి అత్యాచారం చేసినట్లు నిందితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని ఆదివారం సాయంత్రం గన్నవరం బస్టాండు సమీపంలో తిరుగుతుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.

Pages