న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ
Published Tuesday, 20 September 2016నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 19: జమ్మూ-కాశ్మీర్లోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హతులైన భారత సైనికులకు సంఘీభావంగా నెల్లూరు న్యాయవాదులు సోమవారం రాత్రి జిల్లా కోర్టు ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ రోజారెడ్డి, ఉపాధ్యక్షుడు కుడుముల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులతోపాటు బార్ మాజీ జనరల్ సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వీరు జై జవాన్ అని నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు తమ సంతాపాన్ని తెలిపారు.
బిజెపి లీగల్ సెల్ ఖండన