అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు
Published Saturday, 23 July 2016రాజమహేంద్రవరం, జూలై 22: గోదావరి తీరంలో అంత్య పుష్కరాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లి విరయనుంది. పవిత్ర అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చే పుష్కర యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర భూమికలో కీలకపాత్ర పోషించే దేవాదాయ ధర్మాదాయశాఖ అంత్య పుష్కరాల పనె్నండు రోజులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు, గోదావరి నది ఒడ్డున వున్న ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్థ్యం కలిగిన పురాణ ఇతిహాస క్షేత్రాల్లో పుష్కర యాత్రికుల దైవ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.