సాయినాథుని దీవెనలతో ప్రజలు వర్ధిల్లాలి
Published Wednesday, 20 July 2016సిద్దవటం,జూలై 19: సద్గురు సాయినాథుని దీవెనలతో ప్రజలు వర్ధిల్లాలని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను వేడుకున్నారు. మండలంలో ని భాకరాపేట సమీపంలో ఉన్న 11వ ఎపిఎస్పి బెటాలియన్ సమీపంలోని షిర్డిసాయిబాబా ఆలయంలో మంగళవారం జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన సాయినాథునికి అభిషేకాలు తదితర పూజలుచేసి అన్నదాన కార్యక్రమాన్ని ఆయనతోపాటు బెటాలియన్ కమాండెంట్ సామ్యూల్ జాన్సల్లు ప్రారంభించారు. అలాగే క్వార్టర్స్లో సాయినాథుని గ్రామోత్సవం వైభవంగా జరిగింది.