పెరిగిన పసిడి ధర
Published Tuesday, 19 July 2016దిల్లీ: నిన్న రూ.200 తగ్గి రెండు వారాలు కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర ఈరోజు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పసిడి ధర పైకి వెళ్లింది. దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.30,750కి చేరింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగి రూ.46,330కి చేరుకుంది.