S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : మంగళవారం ఉదయం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల బాటపట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 32 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది, నిఫ్టీ 15 పాయింట్లడాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు కోల్పోయి రూ. 67.35ల వద్ద ఉంది.కు పైగా నష్టంలో ట్రేడవుతోంది.

‘పుణ్యకాలా’నికీ పనులు పూర్తికావు!

విజయవాడ, జూలై 4: కృష్ణా పుష్కరాలకు కేవలం 38 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా విజయవాడ నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు పుష్కరుడు కృష్ణలో ప్రవేశించే పుణ్యకాలం నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. పుష్కరాల సమయానికి ఈ పనుల్లో 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే చేయగలమని అధికారులే చెపుతున్నారు.
పనుల జాప్యానికి ఫ్లైఓవరే కారణం!

ప్రైవేటు సంస్థలకు కోట్ల విలువైన భూములు

హైదరాబాద్, జూలై 4: ఒక పెద్ద ఆసుపత్రికి ఎంత స్థలం కావాలి? మహా అయితే 30 ఎకరాలు. మరి ఒక కాలేజీకి ఎంత స్థలం కావాలి? మామాలుగా బిట్స్ పిలానీకి సర్కారు ఇచ్చిందే 30 ఎకరాలు. ప్రసిద్ధ సిల్వన్ ఇన్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కాలేజీకి భూమి అడిగితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఐదెకరాలు. వీటికి సర్కారు ఇచ్చిన భూమి తక్కువయినా సదరు సంస్థలు మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశాయి. మరి అమరావతిలో ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న భూములెంతో తెలుసా? వందల ఎకరాలు! ముక్కు పిండి డబ్బులు వసూలు చేసే ప్రైవేటు సంస్థలపై సర్కారు బహు దొడ్డమనసు చూపిస్తోంది.

మైత్రీ బంధంలో నవశకం

న్యూఢిల్లీ, జూలై 4: మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో ఐదు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ 7వ తేదీ నుంచి పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్లు, తీరప్రాంత పరిరక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయంలో సహకారం వంటి కీలక అంశాలపై ఈ నాలుగు దేశాలతో మోదీ విస్తృత స్థాయిలో చర్చిస్తారు. అనేక ఆఫ్రికాదేశాలతో భారత్ వ్యాపార, వాణిజ్యపరంగా సత్సంబంధాలను విస్తరించుకోడానికి ఈ నాలుగుదేశాలతో బలమైన మైత్రీ బంధం అత్యంత కీలకం. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత ఆఫ్రికా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి.

విద్యుదాఘాతానికి ఏనుగు మృతి

చిన్నగొట్టిగల్లు, జూలై 4: విద్యుదాఘాతానికి గురై ఓ ఏనుగు మరణించిన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం, చింతగుంట పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని సుబ్బరామపురం వద్ద రైతు సిద్దయ్యకు చెందిన మామిడితోటలో 11 కెవి విద్యుత్ లైను మనిషి ఎత్తులో వేలాడుతుండడంతో ఆహారం కోసం వచ్చిన ఏనుగుల గుంపులో ఒకటి విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో మరణించింది. సంఘటన స్థలానికి అటవీ శాఖాధికారులు చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు.

ఇక మహిళా బెటాలియన్?

న్యూఢిల్లీ, జూలై 4: సాయుధ దళాల్లో మహిళల ప్రమేయాన్ని మరింతగా పెంచే అవకాశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మహిళలతో కూడిన ఓ బెటాలియన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని అలాగే యుద్ధ నౌకల్లోనూ మహిళలు పనిచేసేలా చూడడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. మహిళా పైలెట్లను నియమించడంతో వారి సామర్ధ్యానికి సంబంధించిన మానసికపరమైన అవరోధం తొలగిపోయిందని, ఇప్పుడు రక్షణ రంగంలోకి, మిగతా రంగాల్లోనూ మహిళ పాత్రను మరింతగా పెంచేందుకుగల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

9న రష్యాకు చంద్రబాబు

హైదరాబాద్, జూలై 4: నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల చైనాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు త్వరలోనే వేలాది కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో కీలక దేశం రష్యాలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇండస్ట్రియల్ నెట్ థీమ్‌తో రష్యాలో జరగనున్న అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిల్ ఇన్నోప్రోమ్ 2016లో పాల్గొనేందుకు చంద్రబాబు నిర్ణయించారు.

స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారకర్తగా అమితాబ్!

న్యూఢిల్లీ, జూలై 4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు ప్రచారకర్తగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నియమితులుకానున్నారు. ఈ మేరకు అభిప్రాయం కోరుతూ అమితాబ్‌కు లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అభియాన్‌లోని ఓ ఎపిసోడ్‌కు బచ్చన్ సేవలు వినియోగించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ భావిస్తోంది. వ్యర్థాలు ఎక్కడిబడితే అక్కడ పడేయకుండా కంపోస్టు ఎరువుగా వాడుకోవడం, ఖాళీ స్థలాలను చెత్తతో నింపేయకుండా ఉండేందుకు ఓ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.

గుర్గావ్‌లో తారుషి అంత్యక్రియలు పూర్తి

న్యూఢిల్లీ, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌లో ఉగ్రవాదులచే హత్యకు గురైన యువతి తారిషీ జైన్ మృతదేహాన్ని న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యుసి బర్కిలీ విద్యార్థిని అయిన తారిషీ సెలవులను గడిపేందుకు ఢాకా వెళ్లింది. తారిషీ తండ్రి దాదాపు రెండు దశాబ్దాల నుంచి బంగ్లాదేశ్‌లో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. కాగా, సోమవారం న్యూఢిల్లీకి చేరుకున్న తారిషీ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు డిఎల్‌ఎఫ్ ఫేజ్-1 కమ్యూనిటీ సెంటర్‌లో ఉంచారు.

ఉగ్రదాడి మృతులకు బంగ్లా కన్నీటి నివాళి

ఢాకా, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత యువతి సహా 20 మంది బాధితులకు ఆ దేశం కన్నీటి నివాళులర్పించింది. సోమవారం నిర్వహించిన ఈ సంతాప కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా నాయకత్వం వహించి మృతులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఢాకా కంటోనె్మంట్‌లోని బంగ్లాదేశ్ ఆర్మీ స్టేడియంలో జరిగిన ఈ సంతాప కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలువురు దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులతోపాటు సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మృతులకు ఘనంగా నివాళులర్పించారు.

Pages