ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వేళల్లో స్వల్ప మార్పు
Published Tuesday, 5 July 2016విజయవాడ : ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సికిం ద్రాబాద్ - విజయవాడ ఇంటర్సిటీ ( నెంబర్ 12796 ) ఎక్స్ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే స్వల్పంగా మార్పు చేసింది. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరే రైలు 10.08 గం టలకు గుంటూరు వచ్చి 10.10 గంటలకు విజయవాడ బయలుదేరి వెళుతోన్నది. ఇకపై గుంటూరుకు ఉదయం 9.40 గంటలకే వచ్చి 9.42 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10.45 గంటలకు చేరుకొంటుంది.