S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో స్వల్ప మార్పు

విజయవాడ : ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సికిం ద్రాబాద్‌ - విజయవాడ ఇంటర్‌సిటీ ( నెంబర్‌ 12796 ) ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే స్వల్పంగా మార్పు చేసింది. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 10.08 గం టలకు గుంటూరు వచ్చి 10.10 గంటలకు విజయవాడ బయలుదేరి వెళుతోన్నది. ఇకపై గుంటూరుకు ఉదయం 9.40 గంటలకే వచ్చి 9.42 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10.45 గంటలకు చేరుకొంటుంది.

మోదీ మంత్రివర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు. నిహాల్‌ చంద్‌, రామశంకర్‌ కఠారియా, సన్వర్‌లాల్‌ జాట్‌, మనుసుఖ్‌భాయ్‌ వాస్వా, ఎం.కె.కుందారియాను మంత్రివర్గం నుంచి తొలగించారు. సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి కల్పించడంతో పాటు 19మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

మోదీ క్యాబినెట్‌లో కొత్తమంత్రులు వీరే..

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాలులో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సహాయ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు క్యాబినెట్ హోదా లభించింది. ఈసారి క్యాబినెట్ విస్తరణలో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది.
కొత్త మంత్రులు వీరే...
-------------------------

ఆటోను ఢీకొన్న బస్సు: ముగ్గురు మహిళల మృతి

నల్గొండ: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో 8 మంది వెళుతుండగా వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొంది. గాయపడ్డ ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు

శ్రీకాకుళం: పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు లోనై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సామగ్రి కింద పడినట్లు పలువురు తెలిపారు. కాగా, నెలరోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఇతరులకు గదుల కేటాయింపుపై టిడిఎల్‌పి ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గతంలో తమకు కేటాయించిన గదులను ఇతరులకు కేటాయించడం పద్ధతి కాదని టిడిఎల్‌పి నాయకులు విమర్శిస్తున్నారు. తాము గదులను ఖాళీ చేయకుండానే వాటిని వేరేవారికి ఇవ్వడంలో స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్షంగా వ్యవహరించారని టిడిపి నేత రేవంత్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై అవసరమైతే తాము కోర్టుకు వెళతామన్నారు. అలాగే, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఎర్రబిల్లి దయాకరరావుకు ఏపి ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో నివాసం కేటాయించడం సరికాదని ఆయన ఎపి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎర్రబిల్లి చేత క్వార్టర్సు ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ఆస్పత్రిలో మానసికరోగి వీరంగం

నల్గొండ: ఓ మానసికరోగి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రి వార్డులో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశాడు. దీంతో చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని మానసికరోగిని బంధించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది. కార్తీ చిదంబరం స్వయంగా లేదా తన ప్రతినిధి ద్వారా ఈ వారంలో హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. 2జీ కుంభకోణంలో ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంలోని మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా తొలిసారి కార్తీకి ఈడీ నోటీసులు పంపించింది.

ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి : కొత్త మంత్రుల ప్రమాణం

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో మంగళవారం ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి లభించింది. కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ్‌ గోయల్‌, మహారాష్ట్ర నుంచి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున రాజ్యసభకు ఎన్నికైన రామ్‌దాస్‌ అథవలే, అసోంలోని నాగావ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాజెన్‌ గొహేన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అనిల్‌ మాధవ్‌ దవే మంత్రులుగా ప్రమాణం చేశారు.

వరద తాకిడికి ఉత్తరాఖండ్ అతలాకుతలం

ఉత్తరాఖండ్‌ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేశాయి. ఛమోలీ ప్రాంతంలో చాలా గ్రామాలు వరద బారిన పడ్డాయి. నదులు పొంగడంతో భారీ సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఆహారం, తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నారు. వర్షాలకు చాలా ఇళ్లు కూలిపోవడంతో భయపడి పారిపోయామని ప్రజలు తెలిపారు.

Pages