S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం బూచి కాదు.. జాగ్రత్తపడితే చాలు

మెరుపు మెరిస్తే, వాన కురిస్తే మా కోసమే అనుకునే పిల్లల ఆనందం వానలో తడిసిముద్దయిన వేళలో ఇంద్రధనస్సులా మనసు వికసిస్తుంది. ఆ తరవాత అనారోగ్యం పాలవుతారు. చిన్నారులకు నీళ్లతో ఆడడం అన్నా, వర్షంలో తడవడం అన్నా మహా సరదా. వారిని కట్టడి చేయడం అనుకున్నంత ఈజీ కాదనే చెప్పాలి. కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరి.

- ఎం.కె.

లంచం ఇవ్వలేదని డ్రైవర్‌పై పోలీసుల దాడి

కర్నూలు: లంచం ఇవ్వలేదంటూ లారీ డ్రైవర్‌పై మంగళవారం పోలీసులు దాడి చేశారు. గోస్పాడు మండలం సాంబవరం మెట్ట దగ్గర పోలీసుల దాడిలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పట్టిసీమ పంపులు రేపు ప్రారంభం

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టులో పంపులను బుధవారం నాడు ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించేందుకు టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

7న విశాఖకు దిగ్విజయ్ రాక

విశాఖ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 7న నగరానికి వస్తున్నారు. ఆ రోజు జరిగే నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దిగ్విజయ్‌తో పాటు ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు.

నగలకు మెరుగు పెడతామని టోకరా

విజయవాడ: నగలకు మెరుగు పెడతామని నమ్మించి సుమారు లక్ష రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఆగంతకులు దోచుకుపోయిన సంఘటన ఇక్కడి ప్రసాదం పాడులో మంగళవారం జరిగింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

మంత్రి పోచారం రాజీనామా చేయాలి: షబ్బీర్

హైదరాబాద్: బ్యాంకులు, విత్తనాల కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినడం లేదని నిస్సహాయత ప్రకటిస్తున్న తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రైతులు సమస్యలతో సతమతమవుతున్నా కెసిఆర్ సర్కారు ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు. రుణమాఫీని సక్రమంగా అమలు చేయాలని, రైతులకు సబ్సిడీ ధరలపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందజేయాలని కోరారు.

సస్పెన్షన్లు ఎత్తివేస్తే విధులకు వస్తాం

హైదరాబాద్: 11 మంది జడ్జీలపై సస్పెన్షన్లను ఎత్తివేస్తే తాము విధులకు హాజరవుతామని తెలంగాణ న్యాయాధికారులు మంగళవారం తెలిపారు. ఇక్కడ మంగళవారం జరిగిన తెలంగాణ న్యాయాధికారుల సంఘం సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని సంఘం నాయకులు ఉమ్మడి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేరిస్తే సుప్రీం కోర్టు, హైకోర్టు చేసిన సూచనలను పాటిస్తామని కూడా వారు ప్రకటించారు.

14 మంది జూదరుల అరెస్టు

కాకినాడ: రాజానగరం మండలం బొల్లకడియం వద్ద మంగళవారం ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.5 లక్షల రూపాయల నగదు, 5 బైకులు, 13 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

గోస్తని కాల్వలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

ఏలూరు: తణుకు సమీపాన సజ్జాపురం వద్ద గోస్తని నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. మృతులను లక్ష్మీనరసమ్మ (32), ఆమె కుమార్తె లాస్య (7)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఆదివారం నుంచి కనిపించడం లేదు. కుటుంబ కలహాల వల్లే కుమార్తెతో పాటు కాల్వలోకి దూకి తల్లి నరసమ్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

సల్మాన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో మహారాష్ట్ర పిటిషన్

ముంబయి: ‘కండల వీరుడు’, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ‘హిట్ అండ్ రన్’ కేసు ఇంకా వదలడం లేదు. ఆ కేసులో నిర్దోషిగా విడుదలైన సల్మాన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిని విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం మంగళవారం తెలిపింది. 2002లో మద్యం సేవించి ఫుట్‌పాత్ మీదకు కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడని సల్మాన్‌పై కేసు నమోదై ఏళ్ల తరబడి విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే. కొద్దినెలల క్రితం బాంబే హైకోర్టు సల్మాన్‌కు అనుకూలంగా ఆ కేసును కొట్టివేసింది.

Pages