ప్రాజెక్ట్ పనులను సకాలంలో పూర్తి చేయాలి
Published Monday, 4 July 2016హైదరాబాద్, జూలై 3: నగర శివారు ప్రాంతాల్లో నీటి వ్యవస్థను మేరుగు పర్చేందుకు రూ.1900 కోట్లతో చేపడుతున్న పనులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యం చేపడుతున్న, చేపట్టనున్న పనులపై ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు, సిజిఎం, జిఎంలో సమావేశమై పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల వద్ద తప్పకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేయలని ఎండి అధికారులను అదేశించారు.