11నుంచి సమ్మె
Published Monday, 4 July 2016న్యూఢిల్లీ, జూలై 3: ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంచిన వేతనాలు తమకు సరిపోవంటూ దేశవ్యాప్తంగా ఉన్న 33 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 11నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. 7 వేల రూపాయలుగా ఉన్న బేసిక్ వేతనాన్ని 2.57 శాతం ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం వేతన సంఘంలో రూ. 18 వేలుగా నిర్ణయించారు. అయితే 3.68 శాతం ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం రూ 28,000గా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని అఖిల నారత రైల్వే మెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, జాతీయ సంయుక్త కార్యాచరణ కౌన్సిల్ కన్వీనర్ అయిన శివగోపాల్ మిశ్రా ఆదివారం ఇక్కడ చెప్పారు.