జగ్గయ్యపేటలో భారీ కార్డన్ సెర్చ్
Published Monday, 4 July 2016జగ్గయ్యపేట, జూలై 3: పట్టణంలోని ధనంబోడు కాలనీలో ఆదివారం రాత్రి నందిగామ డిఎస్పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల సిఐలు, డివిజన్లోని 12మంది ఎస్ఐలతో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ ధనంబోడు కాలనీలోని సుమారు 500 ఇళ్లలో పోలీసులు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. స్వయంగా డిఎస్పి ఉమామహేశ్వరరావు పలు ఇళ్లలోకి వెళ్లి ఎవరెవరు నివసిస్తున్నారు, పరిసరాల్లో ఎవరెవరు నివసిస్తున్నారు, తదితర అంశాలను ప్రశ్నించారు. వాహనాలను వాటి రికార్డులను పరిశీలించారు.