కమ్ముకున్న మేఘాలు
Published Sunday, 3 July 2016మహబూబ్నగర్, జూలై 3: గతపది రోజుల నుండి జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నప్పటికినీ వరుణుడు మాత్రం కనికరించడంలేదు. వానలు ఊరిస్తుడడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో కుండపోత వర్షం కురిసి నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తుంటే మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి, రెండవ వారంలో భారీగానే జిల్లాలో వరుణుడు కనికరించినప్పటికిని భారీ స్థాయిలో చెరువులు కుంటలు నిండి అలుగుపారే వాన కురియకపోవడం దురదృష్టకరం.