ముగ్గురు కొత్తహీరోల జిందగీ
Published Sunday, 3 July 2016కిరణ్, వర్ధన్, ఫణిప్రకాష్ ప్రధాన తారాగణంగా దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘జిందగీ’. కె.దయాకర్రెడ్డి స్వీయ దర్శకత్వంలో వి.చంద్రశేఖర్తో కలసి ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ కూకట్పల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక నాయకుడు నారాయణస్వామి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దయా మాట్లాడుతూ, కళాశాల ముగిశాక విద్యార్థులుగా ఉన్న ముగ్గురు మిత్రులు తమ జీవితాన్ని ప్రారంభించి ఏమేమి సాధించారు, వారి జీవితంలో మలుపుతిరిగిన అవకాశాలు ఎలా వచ్చాయి, వాటిని ఎలా వినియోగించుకుని సమాజానికి మేలు చేశారు?