ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
Published Sunday, 3 July 2016మంచిర్యాల, జూలై 3: ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఎఎస్పీ విజయ్కుమార్ అన్నారు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ, గోపాల్వాడల్లోని వార్డుల్లో పర్యటిస్తూ వార్డు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఎలాంటి సమస్యలున్నా, అభ్యంతరాలున్నా స్వచ్ఛందంగా వచ్చి జనమైత్రి అధికారి ద్వారా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, మీ కాలనీల్లో ఎలాంటి సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. పేద పిల్లలకు స్కూల్బ్యాగ్స్, మహిళలకు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు.