రుణమాఫీపై దుష్ప్రచారం తగదు : ఆదాల
Published Sunday, 3 July 2016నెల్లూరు రూరల్, జూలై 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విడతలవారీగా రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీ జరగడం లేదంటూ దుష్ప్రచారం చేయడం తగదని ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు మండల పరిధిలోని ములుముడి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలుగదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో రైతుల రుణమాఫీ 60 కోట్ల రూపాయలుగా నిర్ధారించగా, అందులో 31 కోట్ల రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు.