మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం
Published Sunday, 3 July 2016విశాఖపట్నం, జూలై 2: దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు. ఇక్కడి సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై ప్రేమ పేరుతో దాడులు ఎక్కువ అవుతున్నాయని, నేరస్తులకు కొంతమంది అధికార పార్టీ నేతలం కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు న్యాయం జరుగడం లేదన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ప్రసార మాధ్యమాల్లో మహిళలను అంగడివస్తువుగా చూపిస్తుండటంతో దాడులు ఎక్కువ అవుతున్నాయన్నారు.