గవర్నర్తో కెసిఆర్ మంతనాలు
Published Saturday, 2 July 2016హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం రాజ్భవన్లో కలిశారు. తెలంగాణలో న్యాయవాదులు ఆందోళన, న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు, హైకోర్టు విభజన, తాజా పరిణామాలపై ఆయన గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. లాయర్ల ఆందోళనపై గవర్నర్ శుక్రవారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు కొంతమంది ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ వివరాలను ఆయన సిఎంకు తెలిపినట్లు భోగట్టా.