లిట్టర్ ఫ్రీ జోన్లలో
Published Monday, 16 May 2016విజయవాడ (కార్పొరేషన్), మే 15: నగరంలో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న లిట్టర్ ఫ్రీ జోన్ల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంతకుముందు జివిబి సంస్థ ద్వారా ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన అధికారులు ప్రస్తుతం ఆ సంస్థ కాంట్రాక్ట్ ముగియడమే కాకుండా వారి చర్యలపై సంతృప్తి చెందని అధికారులు కాంట్రాక్ట్ను అమలును రద్దు చేశారు. దీంతో విఎంసి ప్రజారోగ్యశాఖకు చెందిన పారిశుద్ధ్య కార్మికులతోనే లిట్టర్ ఫ్రీ జోన్లలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ చేపట్టిన విఎంసి అధికారులు ప్రస్తుతం ఆయా పనులను మరింత విస్తృత పర్చి నూరుశాతం లిట్టర్ ఫీ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.