స్టాక్ మార్కెట్కు ‘పి-నోట్’ షాక్
Published Saturday, 14 May 2016ముంబయి, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతానికి పడిపోవడం, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతానికి పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు పి-నోట్ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేయడం విదేశీ మదుపరుల పెట్టుబడులకు విఘాతం కలిగించింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 300.65 పాయింట్లు పతనమై 25,489.57 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 85.50 పాయింట్లు క్షీణించి 7,814.90 వద్ద స్థిరపడింది.