తప్పిన పెను ముప్పు
Published Saturday, 14 May 2016చింతూరు, మే 13: పోలీసు బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు పన్నిన వ్యూహాన్ని ఆంధ్రా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది భగ్నంచేశారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని ఏడుగుర్రాలపల్లి గ్రామ సమీపంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు శుక్రవారం గుర్తించారు. అలాగే మరో ప్రదేశంలో మరో మూడు మందుపాతరలు అన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో వారపు సంత జరుగుతుంది. దండకారణ్య సమీపంలో ఈ గ్రామం ఉండటంతో పోలీసులు ఏడుగుర్రాలపల్లి సరిహద్దు ప్రాంతాన్ని చుట్టుముట్టి వారి అధీనంలోకి తీసుకుంటారు.