S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొంత లాభానికే ప్రాజెక్టుల రీ-డిజైనింగ్

హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌లో సిఎం కెసిఆర్‌కు స్వార్థ ప్రయోజనాలున్నాయని టి.కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మంగళవారం ఇక్కడ ఆరోపించారు. మహారాష్టల్రో భూములు ముంపునకు గురికాకుండా ఆ రాష్ట్ర సిఎంతో కెసిఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు.

చంద్రబాబు, మంత్రుల ఇళ్లకు సేవలు బంద్ చేయండి

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నందున ఎపి సిఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుల ఇళ్లకు మంచినీరు, పారిశుద్ధ్య సేవలను బంద్ చేయాలని ఓయు విద్యార్థి సంఘనేతలు మంగళవారం విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉంటూ ఇలాంటి ప్రకటనలు చేయడం ఎపి నేతలకు తగదన్నారు.

దిల్లీ వెళ్లి జగన్ ఏం సాధించారు?: కళా

విజయవాడ: ‘ సేవ్ డమొక్రసీ ’ పేరుతో దిల్లీయాత్ర చేసిన వైకాపా అధినేత జగన్ అక్కడ ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఎపికి ప్రత్యేక హోదాపై దిల్లీలో ఉన్నపుడు జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. పైసా ఖర్చులేకుండా రాజధాని కోసం 34వేల ఎకరాలను సేకరించగా లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో జరిగే పార్టీ మహానాడులో అభివృద్ధి పథకాలు, రాష్ట్ర సమస్యలు, రాజకీయ పరిణామాలపై క్షుణ్ణంగా చర్చిస్తామన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఘన సన్నాహాలు

హైదరాబాద్: వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారును ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను ఆయన మంగళవారం సమీక్షించారు. నగరంలోని లుంబినీ పార్కులో లేజర్ షో జరిగే ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

ఎపి ప్రగతికి మద్దతు: మలేషియా మంత్రి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమ దేశం భాగస్వామి అవుతుందని మలేషియా మంత్రి ముస్త్ఫా మహ్మద్ అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ, ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమేనన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నందున ఎపిలో పారిశ్రామికీకరణకు దండిగా అవకాశాలున్నాయని చంద్రబాబు అన్నారు. తాము అన్ని వసతులూ కల్పిస్తున్నందున ఇప్పటికే 26 దేశాలు ఎపిలో పరిశ్రమలను ప్రారంభించాయని ఆయన వివరించారు.

అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు

విజయవాడ: ఎంఆర్‌పి (గరిష్ట చిల్లర ధర) కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎపి ఎక్సయిజ్ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం హెచ్చరించారు. చాలాచోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 200 మంది మద్యం దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.

హోదాపై ప్రైవేటుబిల్లుకు మద్దతివ్వండి: కెవిపి

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు టిడిపి అధినేత చంద్రబాబుకు మంగళవారం లేఖ రాశారు. గత శుక్రవారం ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టిడిపి ఎంపీలు సానుకూలంగా మాట్లాడారు. ఎన్‌డిఎలో టిడిపి భాగస్వామిగా ఉన్నందున బిజెపితో పాటు ఇతర మిత్రపక్షాలను ఒప్పించి బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని కెవిపి కోరారు.

హెచ్‌ఎంఆర్ ఎండిగా శివానంద నింబర్గే

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు కొత్త ఎండిగా శివానంద నింబర్గే జూన్ 2న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ఎండి విబి గాడ్గిల్ వచ్చేనెలలో పదవీ విరమణ చేస్తున్నందున శివానందను నియమించారు.

ఆస్తులమ్మేసి జనం బాధలు జయ తీర్చాలి :ఖుష్బూ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెకున్న కోట్లాది రూపాయల ఆస్తులను అమ్మేసి జనం బాధలు తీర్చవచ్చు కదా!.. అని కాంగ్రెస్ ప్రచారకర్త, సినీనటి ఖుష్బూ అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంచీపురం జిల్లా మధురవాయల్‌లో జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్‌లో వరదలు వచ్చినపుడు మధురవాయల్ నియోజకవర్గ ప్రజలను జయలలిత ఆదుకోలేదని ఖుష్బూ ఆరోపించారు. ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వానికి చేతకానపుడు జయలలితే తన ఆస్తులను విక్రయించి జనం బాధలు తీర్చవచ్చుకదా? అని ఆమె వ్యాఖ్యానించారు.

నన్ను టార్గెట్ చేయడం సంతోషమే: రాహుల్

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో తనను ఇరికించేందుకు బిజెపి రాజకీయ కుట్ర చేస్తోందని అయినా వారికి తాను టార్గెట్ కావడం సంతోషం కలిగిస్తోందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. హెలికాప్టర్ల కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రాహుల్‌కు ఉన్న వ్యవహారాలేమిటో విచారణ జరిపించాలని బిజెపి ఎంపి ఒకరు ఆరోపించారు. ఈ విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ‘నన్ను టార్గెట్ చేయడం ఆనందం కలిగిస్తోంది..’ అని మంగళవారం పార్లమెంటు భవనం వద్ద మీడియా ప్రతినిధులతో అన్నారు.

Pages