నీటికోసం వచ్చి బావిలోపడ్డ చిరుత
Published Tuesday, 3 May 2016కరీంనగర్: దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ చిరుతపులి బావిలోపడిన ఘటన ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లిలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. బావిలో పడిన చిరుతను చూసి గ్రామస్థులు అధికారులకు సమాచారం చేరవేశారు. బావిలోనుంచి చిరుతను బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు.