S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజ్‌ను గెంటేశారు!

వెల్లింగ్టన్, మే 2: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫ్రాంక్లిన్ రోజ్‌ను న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గెంటేశారు. అనుమతించిన కాలం పూర్తయినప్పటికీ, అనధికారికంగా న్యూజిలాండ్‌లో ఉంటున్న అతనిపై కేసు నడిచింది. ఐదు వారాల శిక్షను అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అధికారులు అతనిని జమైకా విమానం ఎక్కించారు. కెరీర్‌లో 19 టెస్టులు, 27 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన 44 ఏళ్ల రోజ్ 2011లో అక్లాండ్ యూనివర్శిటీ క్రికెట్ క్లబ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు కుదుర్చుకొని, న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి వర్క్ వీసాను సంపాదించాడు. అతని వీసా గడువు 2012తో ముగిసింది.

బెటిస్‌పై గెలుపు

మాడ్రిడ్, మే 2: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తాజా మ్యాచ్‌లో ఆ జట్టు రియల్ బెటిస్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఇవాన్ రకిటిక్, లూయిస్ సౌరెజ్ చెరొక గోల్ చేసి బార్సిలోనాను గెలిపించారు. మరో మ్యాచ్‌లో అట్లెటికో మాడ్రిడ్ 1-0 తేడాతో రయో వలెకానోపై గెలిచింది. ఆంటోనీ గ్రీజ్మన్ కీలకమైన గోల్ చేసి అట్లెటికోకు విజయాన్ని సాధించిపెట్టాడు. రియల్ మాడ్రిడ్ స్టార్ గారెత్ బాలే అద్భుతమైన హెడర్ ద్వారా గోల్‌ను అందించి, రియల్ సోసిడాడ్‌పై తన జట్టు గెలవడంలో కీలక భూమిక పోషించాడు.

రద్వాన్‌స్కా నిష్క్రమణ

మాడ్రిడ్, మే 2: ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక ఈవెంట్‌గా పేర్కొనే మాడ్రిడ్ ఓపెన్ నుంచి టాప్ సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చివరి క్షణంలో వైదొలగడంతో, టాప్ సీడింగ్ పోలాంగ్‌కు చెందిన రద్వాన్‌స్కాకు దక్కింది. టైటిల్ సాధించే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని క్రీడాపండితులు జోస్యం చెప్పారు. కానీ, మొదటి రౌండ్‌లో డొమినికా సిబుల్కొవా (స్లొవేకియా)ను ఢీకొన్న ఆమె 4-6, 3-6 తేడాతో ఓటమిపాలైంది. 2012లో మొదటిసారి 2014లో రెండోసారి సుమీ ఫైనల్ వరకూ చేరిన రద్వాన్‌స్కా ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకోలేకపోయింది.

ఉత్తరప్రదేశ్ బరిలో ప్రియాంక లేదా రాహుల్?

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తిరిగి స్వర్ణయుగం తీసుకువచ్చేందుకు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తురుపుముక్కల్ని ప్రయోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి ప్రచార వ్యూహకర్తగా.. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాకూటమికి వ్యూహకర్తగా వ్యవహరించిన కిశోర్.. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకుగానూ కాంగ్రెస్ పక్షాన ప్రచార వ్యూహాన్ని రచించబోతున్నారు.

ఇటలీ నావికుడిని స్వదేశానికి వెళ్లనివ్వండి

రోమ్, మే 2: ఢిల్లీలో నాలుగేళ్లకు పైగా కాలం నుంచి నిర్బంధంలో ఉన్న ఇటలీ నావికుడిని భారత్ విడుదల చేయాలని, అతన్ని స్వదేశానికి వెళ్లనివ్వాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆర్బిట్రేషన్ కోర్టు ప్రాథమికంగా తీర్పు ఇచ్చిందని ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అయితే ఈ కేసు విచారణ ఆర్బిట్రేషన్ కోర్టులో కొనసాగుతుందని పేర్కొంది. సముద్ర దొంగలుగా భావించి కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కాల్చి చంపిన కేసులో ఈ ఇద్దరు ఇటలీ నావికులను భారత్ 2012లో అరెస్టు చేసింది. ఈ ఇద్దరిలో ఒక నావికుడు అనారోగ్యం కారణంగా ఇటలీకి తిరిగివెళ్లాడు.

ఓటమెరుగని వీరుడు

పాల, మే 2: కేరళలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, ఓటమంటే ఎరగని కేరళ కాంగ్రెస్ (ఎం) అధినేత కెఎం మణి 13వ సారి పాల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. 83 ఏళ్ల మణి ఇదే నియోజకవర్గం నుంచి 12 సార్లు గెలిచారు. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ్యునిగా స్వర్ణోత్సం జరుపుకొన్న మణి మళ్లీ గెలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కొట్టాయం జిల్లా పాల అసెంబ్లీ నియోజవర్గం వర్గంనుంచి 1965లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం తరువాత 11 ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. 1967, 70, 77, 1980, 82, 87, 1991, 96, 2001, 2006, 2011 ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారు.

మా నుంచి జాప్యం లేదు

కొచ్చి, మే 2: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి విధానపరమైన జాప్యం జరగలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు. న్యాయస్థానాల్లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన కేసులపై ఇటీవల భావోద్వేగానికి గురయి కంటతడి పెట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో, న్యాయ శాఖ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకాలు కొలీజియం వ్యవస్థ ద్వారానే సాగుతున్నాయి.

బొగ్గు వినియోగంతో తగ్గనున్న వర్షపాతం

వాషింగ్టన్, మే 2: భారత్, చైనా వంటి ఆసియా దేశాలలో వేగంగా పెరుగుతున్న బొగ్గు వినియోగం వల్ల భవిష్యత్తులో రుతుపవన వ్యవస్థలు బలహీనపడే అవకాశం ఉందని, తద్వారా వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇటీవల ఒప్పందాలు జరిగినప్పటికీ, నిరుడు డిసెంబర్‌లో ప్యారిస్‌లో వాతావరణ మార్పుపై జరిగిన చర్చల్లో ప్రతిన బూనినప్పటికీ, ఆసియా ఖండంలో విద్యుత్ ఉత్పాదనకు బొగ్గును మండించడమే ప్రధాన వనరుగా ఉంది. భారత్, చైనాలలో మానవ కార్యకలాపాల ద్వారా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఒ2) ఉద్గారాలలో సింహభాగానికి బొగ్గును మండించడమే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది.

హైవేల వెంబడి మద్యం దుకాణాలొద్దు

న్యూఢిల్లీ, మే 2: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం రంగంలోకి దిగింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున దీనికి చెక్‌పెట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తప్పతాగి వాహనాలు నడపడం వల్లే గత ఐదేళ్లలో 1,18,840 మంది మృతి చెందారు.

కొత్త జిహాదీ జాన్ సిద్ధార్థ ధర్

లండన్, మే 2: భారతీయ సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాది సిద్ధార్థ ధర్ కొత్త జిహాదీ జాన్ (సీనియర్ కమాండర్)గా వ్యవహరిస్తున్నట్లు మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి. నిహాద్ బరాకత్ అనే యువతిని సిద్ధార్థ అపహరించుకుపోయి ఐసిస్‌లో సెక్స్ బానిసగా మార్చినట్లు ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. బ్రిటిష్ హిందూ అయిన సిద్ధార్థ ఇస్లాంలోకి మారిపోయి అబు రుమేసా పేరుతో యూకే నుంచి సిరియాకు 2014లో భార్యాపిల్లలతోసహా పారిపోయాడు. యూకేలోని బ్రిటిష్ ముస్లిం టీవీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీలో బరాకత్ అనేక విషయాలను వెల్లడించింది. తనను ఇరాక్‌లోని కిర్కుక్‌లో బంధించారని..

Pages