అంధులకు లేఖకుల సాయం
Published Tuesday, 3 May 2016న్యూఢిల్లీ, మే 2: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్కు హాజరయ్యే అంధులు, మెదడు పక్షవాతం వచ్చినవారు, కీళ్లు-కండరాలకు సంబంధించిన బలహీనతలు ఉన్నవారు.. ఇకపై లేఖకుల సహకారంతో పరీక్షలు రాయొచ్చు. ఈ రకమైన వికలాంగులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహాయకులను ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని యూపీఎస్సీ కల్పించింది. అంతే కాకుండా వీరు పరీక్ష రాసే సమయాన్ని కూడా గంటకు అదనంగా 20 నిమిషాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోవకు చెందిన వికలాంగులు పరీక్ష రాసే సామర్థ్యం 40శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి...