అబద్ధపు హామీలతో రైతులను మోసగించిన సిఎం
Published Tuesday, 3 May 2016మాచర్ల, మే 2: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసగించిన ఘనుడు చంద్రబాబునాయుడని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కరవు ధర్నాలో బాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర కరవు సంభవించిందన్నారు. కరవు సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక్కరూపాయి కూడ ఇవ్వలేదన్నారు.