S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు ముందు ‘కర్నూలు పార్టీ పంచాయితీ’!

విజయవాడ, మే 2: వైకాపా నుంచి వలసలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో అదే స్పీడులో వర్గ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి, నంద్యాల తెలుగుదేశం ఇన్‌చార్జ్ శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రెండు వర్గాలను పిలిపించుకుని పంచాయితీ పెట్టారు. ఎవరికి వారు సిఎంను కలిసి తమ వాదనలు వినిపించారు. ముందుగా శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు చంద్రబాబును కలిసి భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించినట్లు తెలిసింది.

దమ్మిడి సాయానికి వంద లెక్కలా?

రాజమహేంద్రవరం, మే 2: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల పొత్తు కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సహాయం అందడంలేదన్నారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్‌తోపాటు బిజెపికీ భాగం ఉందన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ ముందునుంచీ పాట పాడిన బిజెపి రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తే అందుకు పూర్తిగా సహకరించిందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

ఖమ్మం, మే 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు ఖమ్మం జిల్లా వైకాపా కార్యవర్గమంతా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. సోమవారం ఖమ్మంలో జరిగిన ఆసక్తికర పరిణామాల మధ్య రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఆహ్వానం మేరకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత ఉదయం స్థానిక ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో వైకాపా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి: ముప్పాళ్ల

గుంటూరు (కొత్తపేట), మే 2: ఆర్థిక కుంభకోణంలో బాధితులుగా మారిన అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు. అక్కడి నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ కొనసాగించారు.

తెలంగాణలో ఇతర పార్టీలకు భవిష్యత్ లేదు

ఖమ్మం, మే 2: తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలకు భవిష్యత్ లేదని, త్వరలోనే వైసిపి తరహాలో టిడిపి నేతలంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడి పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల ఆదరణ బాగుందన్నారు.

హౌసింగ్ ఎఇ అక్రమాస్తులు రూ.పది కోట్లు

రామభద్రపురం, మే 2: గృహనిర్మాణశాఖ ఎఇ రూ.పది కోట్ల మేరకు అక్రమాస్తులు కూడబెట్టారు. పక్కాసమాచారంలో ఏకకాలంలో పలు చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు అతని బంధువుల పేర ఉన్న భారీ భవంతులు, లాకర్లలోని బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో గృహ నిర్మాణశాఖ ఎఇగా పనిచేస్తున్న నడిమింటి సత్యం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోమవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

గుంటూరు (కొత్తపేట), మే 2: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సెజ్‌ల పేరుతో వాన్‌పిక్, లేపాక్షి, సరస్వతి సిమెంటు ఫ్యాక్టరీల పేరుతో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి అప్పనంగా కాజేసి, చివరకు ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రైతులపైనే దాడులు చేసిన జగన్‌కు అన్నదాతల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

అభ్యంతరాలుంటే రేపటిలోగా తెలపండి

కాకినాడ, మే 2: ఎపి ఎంసెట్-2016కు హాజరైన అభ్యర్ధులకు ఏ విధమైన అభ్యంతరాలున్నా ఈనెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని జెఎన్‌టియుకె స్పష్టంచేసింది. ఏప్రిల్ 29న ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు ప్రిలిమినరీ కీని జెఎన్‌టియుకె ప్రకటించింది. ప్రిలిమినరీ కీపై ఏ విధమైన అభ్యంతరాలున్నా ఏప్రిల్ 30వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తుచేసుకునే అవకాశం ఉన్నత విద్యామండలి కల్పించింది. సందేహాలు, అభ్యంతరాలుంటే 4వ తేదీలోగా దరఖాస్తుచేసుకోవాలని, ఆ రోజు సాయంత్రం 4 గంటల తరువాత వాటిని పరిశీలిస్తామని ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు.

ఆర్‌టివో ఏజెంట్ల ఆఫీసుల్లో సోదాలు

ఒంగోలు, మే 2: జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు ఆర్‌టిఒ కార్యాలయం బయట ఉన్న ఏజెంట్ల కార్యాలయాలపై సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై కాకినాడ డిటిసి ఆదిమూలం మోహన్ ఎసిబికి చిక్కిన నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్టీఎ ఏజెంట్ల కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం బ్రోకర్ల వ్యవస్ధను చాలా ఏళ్ల కిందట రద్దుచేసింది.

వడదెబ్బకు ఐదుగురు మృతి

అనంతపురం, కడప జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. కడప జిల్లా నందలూరులో కత్తికట్టు జయరామ్ (43), రైల్వేకోడూరు మండలం బయనపల్లెకు చెందిన కె సుబ్బరాయుడు (65), అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన నాగిరెడ్డి (70), ఓబులదేవరచెరువు మండలం తంగేడుకుంట గ్రామానికి చెందిన షేక్‌హుస్సేన్ (11), గోరంట్లకు చెందిన వెంకటేశు (55) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.

Pages