చంద్రబాబు ముందు ‘కర్నూలు పార్టీ పంచాయితీ’!
Published Tuesday, 3 May 2016విజయవాడ, మే 2: వైకాపా నుంచి వలసలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో అదే స్పీడులో వర్గ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి, నంద్యాల తెలుగుదేశం ఇన్చార్జ్ శిల్పా మోహన్రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రెండు వర్గాలను పిలిపించుకుని పంచాయితీ పెట్టారు. ఎవరికి వారు సిఎంను కలిసి తమ వాదనలు వినిపించారు. ముందుగా శిల్పా మోహన్రెడ్డి సోదరులు చంద్రబాబును కలిసి భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించినట్లు తెలిసింది.