మా వారిని విడిచిపెట్టండి
Published Sunday, 1 May 2016చర్ల, ఏప్రిల్ 30: చర్ల మండలం బోదనెల్లికి చెందిన కుంజం బుజ్జిబాబు, పొడియం సారయ్యలు ఎవరికీ ఏ హానీ తలపెట్టే వారు కాదని, మావోయిస్టులు మరోసారి ఆలోచించి సహృదయంతో వారిని విడిచి పెట్టాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు బోదనెల్లి గ్రామస్తులు మావోయిస్టు పార్టీని వేడుకుంటున్నారు. గిరిజనులను కిడ్నాప్ చేసిన సందర్భంగా అక్కడ గ్రామానికి వెళ్లిన విలేఖర్లతో అక్కడి గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెండు వారాల క్రితం కుంజం బుజ్జిబాబును మావోయిస్టులు తీసుకెళ్లారని, అలాగే మూడురోజుల క్రితం మళ్లీ ఇదే గ్రామానికి చెందిన పొడియం సారయ్యను మావోయిస్టులు అపహరించారని గ్రామస్తులు తెలిపారు.