రాజీ మార్గమే మేలు
Published Sunday, 1 May 2016శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 30: రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారం ఎంతో ఆవశ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అన్నారు. రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారంపై రిఫరల్ జడ్జిలకు శనివారం జిల్లా కోర్టులో అవగాహన సదస్సు జరిగింది. జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సాధికారత సంస్థ అధ్యక్షుడు, రాజీమార్గాల కేంద్రం సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ మార్గాల ద్వారా ప్రభావ వంతంగా కేసుల పరిష్కారానికి గల మార్గాలను ఆమె సూచించారు.