-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఏప్రిల్ 3: వెస్టిండీస్తో జరిగిన చివరి, నాలుగో టి-20 మ్యాచ్ని ఏడు వికెట్ల తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు మొదటి రెండు మ్యాచ్ల్లో పాక్ విజయం సాధించగా, మూడో మ్యాచ్ని దక్షిణాఫ్రికా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ వివాహం సోమవారం
రోహతక్ (హర్యానా)లో జరిగింది. వరుడు సత్యవ్రత్ కడియన్ కూడా రెజ్లరే
వెస్ట్ వాంకోవర్ (కెనడా), ఏప్రిల్ 3: ఇక్కడ జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్ లీగ్-2లో భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్లిన తొలి మ్యాచ్లో ఉరుగ్వేను 4-2 తేడాతో ఓడించిన భారత్ రెండో మ్యాచ్లో బెలారస్ను 1-0 తేడాతో ఓడించింది. వందన కటారియా 26వ నిమిషంలో కీలకమైన ఈ గోల్చేసి, భారత్ను గెలిపించింది.
బెంగళూరు, ఏప్రిల్ 3: భుజం గాయం కారణంగా ఈసారి ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) జట్టులోని తన సహచరులను కలిశాడు. వారితో ముచ్చటించాడు. క్రిస్ గేల్ తదితరులను ప్రత్యేకంగా పలకరించాడు. కోహ్నీ ఫిట్నెస్పై ఈనెల రెండో వారంలో నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
ముంబయి, ఏప్రిల్ 3: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, దానిని రద్దు చేయాలని భారత మాజీ క్రికెటర్ రవి శాస్ర్తీ సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో వనే్డ, టి-20 ఫార్మాట్స్లో ప్రపంచ కప్ చాంపియన్షిప్స్ జరుగుతున్నప్పుడు చాంపియన్స్ ట్రోఫీ అవసరం ఏమిటని ప్రశ్నించాడు.
రియో జ్వాల మరింత ప్రజ్వరిల్లింది. తన చిరకాల ప్రత్యర్థి ఒలింపిక్స్
చాంపియన్ కరొలినా మారిన్ను మన సింధు జయించింది. ఆదివారంనాడు ఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను వరుస గేమ్ల్లో గెలిచి సొంతం చేసుకుంది. స్పెయిన్కు చెందిన మారిన్పై తొలినుంచీ
ఆధిక్యతను కొనసాగించి అంతిమంగా సింధునాదం చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 29: పార్లమెంటు ఆవరణలో బుధవారం ఫుట్బాల్ సందడి కనిపించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, జాతీయ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ , పలువురు పార్లమెంటు సభ్యులు సరదాగా ఫుట్బాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది జరిగే ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
హామిల్టన్, మార్చి 29: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టులో విజయానికి చేరువైనప్పటికీ, వర్షం కారణంగా న్యూజిలాండ్ డ్రాతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆట వర్షం కారణంగా రద్దుకావడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఓటమి నుంచి బయపడిన ఆ జట్టు, మూడు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 314 పరుగులు చేసింది.
విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 29: కీలకమైన ఫైనల్ పోటీలో దినేష్ కార్తీక్ చెలరేగిపోయాడు. అతను సెంచరీ చేయడంతో, ఇండియా ‘బి’పై తన జట్టు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ విజయంతో తమిళనాడు దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుని ఈ పోటీలకు తమిళనాడు అర్హత సంపాదించింది.
న్యూఢిల్లీ, మార్చి 29: సుప్రీం కోర్టు నియమించిన పాలక కమిటీ (సిఒఎ) పర్యవేక్షణలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక వర్గం గురువారం సమావేశం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహారాల్లో ప్రస్తుతం అన్ని అధికారాలు సిఒఎకు ఉన్నాయి. దీనితో ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు.