-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 1: హైదరాబాద్లోని ప్రముఖ నగల వ్యాపార సంస్థ ముసద్దీలాల్ జెవెల్లర్స్ యాజమాన్యంపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. రూ. 97 కోట్ల నల్లధనం అక్రమ మార్పిడి చేసినట్టు అభియోగంపై కేసు నమోదైంది. సిసిఎస్, ఎఫ్ఐఆర్, ఐటి శాఖ నివేదిక ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అక్రమ సొమ్ము జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్గా త్వరలోనే ఎదుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. స్వరాష్ట్రంగా నిలదొక్కుకుంటుందో లేదో? అనే భయందోళనలను పటాపంచలు చేస్తూ ఆర్థిక, సంక్షేమ రంగాల్లో తిరుగులేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసుకుంటున్నదని వివరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన శనివారం తెలంగాణ డిజిపి కె.అనురాగ్శర్మకు ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామంటూ కొందరు దేశ, విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే ఎవరు? ఎన్ని ఫోన్ కాల్స్, ఏ నెంబరు ద్వారా వచ్చాయన్నది పేర్కొనలేదు.
యైటింక్లయిన్ కాలనీ, డిసెంబర్ 31: సింగరేణి నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా మరింత కృషి చేయాలని ఆర్జీ-2 జిఎం విజయ పాల్ రెడ్డి కార్మికులకు, అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన చాంబర్లో ఆర్జీ-2 డిసెంబర్ మాసపు బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఆర్జీ-2లో 7,00,153 టన్నులతో 104 శాతం సాధించిన్నట్లు తెలిపారు.
పరకాల, డిసెంబర్ 31: ఆసరా పింఛన్లకు సంబంధిం చిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీంతో లబ్ధిదారులు ప్రతి ఆరు నెలలకోసారి జీవన ధ్రువీకరణ పత్రాలను సమర్పించేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అధికారులే లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నకోడూరు, డిసెంబర్ 31: బైకును కారు ఢీకొని ముగ్గురు మరణించిన సంఘటన సిద్దిపేట మండలం చిన్నకోడూరు మండల పరిధిలోని మందపల్లి స్టేజి రాజీవ్ రహదారిపై శనివారం జరిగింది.
చొప్పదండి, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలోకి అడుగిడటానికి కేవలం కొన్ని గంటల ముందే మృత్యు ఒడిలోకి చేరుతామని ఊహించని సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ శివారులో జరిగింది.
కులకచర్ల, డిసెంబర్ 31: పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెకు అత్త, ఆడపడుచు వేధింపులు తప్పలేదు. అయినా వారి అవమానాలు, వేధింపులు భరిస్తూ, ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. అయినప్పటికీ వేధింపులు తగ్గకపోగా రోజురోజుకూ ఎక్కువయ్యాయి. దీంతో ఆమె మానసిక క్షోభకు గురై తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసి తానూ ఆత్మహత్య చేసుకుంది.
పెద్దపల్లి, డిసెంబర్ 31: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన సమయంలో జైల్లో పెట్టిన కూడా జై తెలంగాణ నినాదాన్ని మాత్రం మరిచిపోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అమరవీరుల త్యాగాలు, వేలాది మంది పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: సికిందరాబాద్లోని గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చీమల జగదీష్ యాదవ్ను శనివారం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ-సేవ లావాదేవీల్లో రూ.3.5 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలపై జగదీశ్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2004లో గోకుల్ అర్బన్ బ్యాంక్ను మోండా మార్కెట్లో ఏర్పాటు చేశారు.