S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలియదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం దీనిపై స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం అరుణ్ జైట్లీకి ముందే తెలిసి ఉంటుందని వ్యాఖ్యానించారు.

12/04/2016 - 00:30

కోల్‌కతా, డిసెంబర్ 3: ‘ఆర్మీ వంటి బాధ్యతాయుతమైన వ్యవస్థపై ఆరోపణలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి పరోక్షంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హితవు పలికారు. బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాలను మోహరించడాన్ని నిరసిస్తూ, ‘సైనిక కుట్ర’కు పాల్పడుతున్నారా? అంటూ మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే.

12/04/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజధాని ఢిల్లీలో తమ హైకమిషన్‌లో పనిచేస్తున్న అధికారుల వేతనాలు విత్‌డ్రా చేసుకోకుండా భారత్ అడ్డంకులు కల్పిస్తోందని పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. పెద్దనోట్ల రద్దు మిషతో తమ దౌత్య అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పాక్ ధ్వజమెత్తింది. భారత్ తీరు వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించింది.

12/04/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో ఓ అమెరికా మహిళా టూరిస్టుపై అత్యాచారానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో విదేశీ మహిళపై అత్యాచారం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారని వారన్నారు.

12/04/2016 - 00:25

శ్రీనగర్, డిసెంబర్ 3: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాల కన్నుగప్పి తప్పించుకోగలిగారు. అధికార వర్గాలు శనివారం ఇక్కడ తెలిపిన వివరాల ప్రకారం..

12/04/2016 - 00:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డులనే కాదు.. ఇక ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్లనూ నగదుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే.

12/04/2016 - 00:14

వడోదర, డిసెంబర్ 3: ప్రభుత్వరంగ ట్రేడింగ్ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసిలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) వేద్ ప్రకాశ్ శనివారం ఇక్కడ తెలిపారు. ‘సంస్థలో 15 శాతం ప్రభుత్వ వాటా అమ్మకానికి మేము సిద్ధంగా ఉన్నాం.

12/04/2016 - 00:13

జపాన్ ఆటోరంగ సంస్థ నిస్సాన్ మోటార్.. భారతీయ మార్కెట్‌కు తమ ప్రతిష్ఠాత్మక కారు జిటి-ఆర్‌ను పరిచయం చేసింది. ముంబయలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం
ఈ సూపర్ కార్‌తో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.99 కోట్ల రూపాయలు. జపాన్‌లోని తొచిగిలోగల నిస్సాన్ ప్లాంట్‌లో
జిటి-ఆర్ తయారవుతోంది

12/04/2016 - 00:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అక్రమ సంపద.. సక్రమ సంపదైపోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న నల్లధనానికి పన్ను చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘కేవలం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా పన్ను చెల్లించకుండా తప్పించుకోవచ్చని అనుకోవద్దు.’ అన్నారు.

12/04/2016 - 00:10

ఉన్నట్టుండి రవీందర్ ఫోన్ చేసినడు. ‘ఏమిటి సంగతి?’ అంటే అతను ‘పాప ఏడ్చింది’ అనేవాడా లేదా నాకు తెలియదు. గ్రైప్ వాటర్ ప్రకటనల గురించి తెలియని, తెలీని, తెలువని వారికి క్షమాపణలు. ‘ఏం సంగతులు?’ అన్నట్టున్న. ‘ఏం లేదు. ఊరికెనే గుర్తుకు వచ్చినవు’ అన్నడు. ఈ లోకంలో ఊరికెనే మనలను గుర్తుచేసుకుని, పలకరించే వాండ్లు గూడ ఉన్నరు గదా, అని సంతోషమయింది. ఆ సంగతే చెప్పిన. అతను నిజంగనే ఊరికే ఫోన్ చేసినడు.

Pages