S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 03:17

మొరాదాబాద్, డిసెంబర్ 3: దేశంలో నల్లకుబేరులకు ఎక్కడికక్కడ ముకుతాడు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తాజాగా మరో షాక్ ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు తెలివిగా జన్‌ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున జమ చేసుకున్న వారికి తల బొప్పికట్టించే నిర్ణయాన్ని మోదీ శనివారం ప్రకటించారు.

12/04/2016 - 03:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఢిల్లీలో హిందూస్తాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నాయి, స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు చెప్పారు.

12/04/2016 - 03:04

యలమంచిలి, డిసెంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రూ.150 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

12/04/2016 - 03:03

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పేదలకు వైద్య సేవలు అందించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కోట్లాది పేదలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీగా మార్చరాదని, ఈ పథకానికి పాడె కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు.

12/04/2016 - 01:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఒక రంజీ మ్యాచ్‌ని రెండు పిచ్‌లపై ఆడించే విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రతిపాదించాడు. ఈ విధంగా ఆడితే, విదేశాల్లో టెస్టు సిరీస్‌లకు అద్భుతమైన జట్టును రూపొందించగలుగుతామని శనివారం ఇక్కడ జరిగిన లీడర్‌షిప్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ అన్నాడు.

12/04/2016 - 01:02

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సూచనలు, వాటి అమలుపై వ్యాఖ్యానించడానికి సచిన్ నిరాకరించాడు. కమిటీ సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఇప్పటికే బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో లోధా సిఫార్సుల అమలుపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

12/04/2016 - 01:00

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా,
శోభన భారతీయతో కలిసి లీడర్‌షిప్ సదస్సుకు హాజరైన
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (కుడి)

12/04/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. లోధా కమిటీ సిఫార్సుల అమలును వ్యతిరేకిస్తున్న అతను తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో, హడావుడిగా నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ అతను కొత్తగా చెప్పిందేమీ లేదు. గతంలో పేర్కొన్న అంశాలను తిగిరి ప్రస్తావించాడే తప్ప తాజా నిర్ణయాలు ఏవీ ప్రకటించలేదు.

12/04/2016 - 00:58

మొనాకో, డిసెంబర్ 3: పురుషుల 200 మీటర్ల పరుగును 19.19 సెకన్లలో పూర్తి చేసి తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేయడం లేదా బద్దలు చేయడం ఇప్పుడు తనకే కష్టమని ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నుంచి ఈ ఏటి మేటి అథ్లెట్ అవార్డును అతను స్వీకరించాడు. మహిళల విభాగంలో ఈ అవార్డు అల్మాజ్ అయానాకు లభించింది.

12/04/2016 - 00:55

సిడ్నీ, డిసెంబర్ 3: సహచర ఆటగాడు మాథ్యూ వేడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కూడా సభ్యుడిగా ఉన్న జట్టు మేనేజ్‌మెంట్ జరిమానా విధించింది. మాక్స్‌వెల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షిఫీల్డ్ షీల్డ్ టోర్నీలో తాను, వేడ్ విక్టోరియా తరఫున ఆడుతున్న విషయాన్ని ప్రస్తావించాడు.

Pages