S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వైకాపా ఎమ్మెల్యేలను ఈరోజుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ప్రకటించారు. వైకాపా సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండైన వైకాపా ఎమ్మెల్యేలు..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తెరాసలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని వీరు స్పీకర్ మధుసూదనాచారికి ఒక లేఖ అందజేశారు.
విశాఖ: సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం ఉదయం విశాఖ, కళింగపట్నం, కృష్ణపట్నం తదితర సాగర తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రహణం విడుపు అనంతరం సముద్ర స్నానం చేస్తే దోషాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. విశాఖ ఆర్కె బీచ్లో స్నానాలు చేసేందుకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు.
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 34 స్థానాల్లో గెలిచి టిఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను సాధించింది. పది డివిజన్లలో కాంగ్రెస్, రెండేసి స్థానాల్లో సిపిఐ, సిపిఎం, వైసిపి అభ్యర్థులు గెలిచారు. టిడిపికి ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం.
హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టులు నిర్మించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి దేవినేని ఉమ బుధవారం చెప్పారు.
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో తెరాస అభ్యర్థులు గెలిచినందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎమ్మెల్యే బాలరాజు కెసిఆర్ను కలిశారు.
ఆదిలాబాద్: గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా రబీ పంటలకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ దండెపల్లి మండలం కేంద్రంలో రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఒంగోలు: ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. పొన్నలూరు మండలం విప్పగుంట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు: ఇద్దరు పిల్లలతో గృహిణి ఆత్మహత్యా యత్నం చేసుకొన్న సంఘటన పుంగలూరు మండలం మంగళం కాలనీలో బుధవారం జరిగింది. స్థానికులు వెంటనే గమనించి ఈ ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.