-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
భీమవరం, అక్టోబర్ 13: పాకిస్తాన్పై సర్జికల్ దాడి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కూటమి ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లోని పేదలు, రైతులపై జరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతుందని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రశ్నించారు. ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
గుంటూరు, అక్టోబర్ 13: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈవిషయమై గురువారం గుంటూరులోని లాం పరిశోధనా కేంద్రంలో రూ.1506 కోట్ల అంచనాలతో నిర్మించే వ్యవసాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల డిజైన్లపై ఆయన అధికారులతో సమీక్షించారు.
తిరుమల, అక్టోబర్ 13: తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో దేశంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఏలూరు, అక్టోబర్ 13 : రాష్ట్రంలో మోటారు వాహనాలు కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి, నెంబరు కేటాయించే నూతన విధానాన్ని ఈ నెల 15వ తేదీన ఏలూరులో ప్రారంభిస్తున్నట్లు రవాణా శాఖ విశాఖ డిప్యూటీ కమిషనరు, ఇ-ప్రగతి స్పెషల్ ఆఫీసర్ ఎస్ వెంకటేశ్వర్లు చెప్పారు.
మంగళగిరి, అక్టోబర్ 13: రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి గతానికి భిన్నంగా పోలీసు శాఖలో నియామకాలు చేపట్టామని, ఇది అభ్యర్థులకు ఉపకరిస్తుందని డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు.
గుంటూరు, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం మరోసారి గ్లోబల్ టెండర్లు పిలిచే యోచనలో ఉంది. గత ఏడాది జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్లను ఎంపిక చేశారు. అయితే అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ఇటీవలే రద్దయింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది.
అనంతపురం, అక్టోబర్ 12: ఇథియోపియా దేశంలోని మడబాల యూనివర్సిటీలో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్ర ప్రొఫెసర్లు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని, బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందవద్దని, త్వరలో వారిని స్వదేశానికి తీసుకొస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
అనకాపల్లి, అక్టోబర్ 12: ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారికి ఒక కిలో 800 గ్రాముల బంగారు కిరీటాన్ని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తయారు చేయించామని తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ కిరీటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అలంకరిస్తామన్నారు. ఆలయ గర్భగుడి ద్వారాలకు వెండి తాపడం వేయిస్తామన్నారు.
శ్రీశైలం, అక్టోబర్ 12: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. దసరా పర్వదినం సందర్భంగా ఉదయం అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, యగాంగ హవనాలు, చండీహోమం, రుద్రహోమం, జయాది హోమాలను అర్చకులు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. యాగశాలలో చండీహోమ పూర్ణాహుతి, స్వామివారి యాగశాలలో రుద్రయాగ పూర్ణాహుతి నిర్వహించారు.
నెల్లూరు, అక్టోబర్ 12: మత సామరస్యానికి మారుపేరుగా పేరొందిన నెల్లూరు రొట్టెల పండగ బుధవారం నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో ప్రారంభమైన ఈ రొట్టెల పండగ ఈనెల 16వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో భక్తుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.