S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/27/2019 - 03:57

తాజాగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అంతా అడవులను ఖాళీ చేయాల్సిందేనా? అసలు వివాదం ఏమిటి? కొత్త వివాదం ఎందుకు వచ్చింది? వన్యప్రాణుల సంరక్షణకు అడవుల్లో మనిషి ఉనికి లేకుండా చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు మన వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆదివాసీల భవిష్యత్ ఏమిటి? 21 రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

02/23/2019 - 21:54

పుల్వామా (కాశ్మీరులో) సీఆర్‌పీఎఫ్ జవాన్లు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చేతుల్లో హతులైతే ఇంకా పాకిస్తాన్‌ను బహిరంగంగా సమర్థించటం ఏమిటి? రోజూ ఎందరో ఆకలితో చనిపోతున్నారు. ఈ సైనికులు యుద్ధంలో చనిపోతే ఏమిటి? అని ఒకడు అన్నాడు. ఇతన్ని భారత పౌరుడు అనగలమా?

02/23/2019 - 01:18

కాశ్మీర్ సమస్య ఇంత కఠినం కావడానికి ప్రధాన కారణం తొలి ప్రధాని పండిట్ నెహ్రు నుండి పలు రాజకీయ పక్షాలు, ఓట్ల బ్యాంకు రాజకీయాలను పరిగణనలోకి తీసుకోవడమే. దేశ సమగ్రత, దేశ రక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేక పోవడమే. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన విధానం రూపొందించి, ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం ఎవ్వరూ చేయకపోవడమే. ఆ దిశలో కొంత మేరకు నిజాయతీతో ప్రయత్నం చేసింది వాజపేయి మాత్రమే.

02/21/2019 - 03:45

చరిత్రను అధ్యయనం చేసిన వారికి- ‘అన్నదమ్ముల మధ్య భూ తగాదా’ లాంటిది కశ్మీర్ సమస్య. భారత్, పాక్‌లు చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య ఇది అని ఉదారవాదులంటారు. మిలిటరీ కోణంలో యుద్ధమే పరిష్కారం. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో వోట్లు తెచ్చే అంశం ఇది. దుర్ఘటనలు జరిగినపుడల్లా ప్రజల్లో దేశభక్తిని రగిలించే విషయం ఇది. దాయాది దేశాల మధ్య దేశ విభజన సమయంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశం కాశ్మీర్.

02/20/2019 - 21:56

కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడితో దేశం ఇంకా కోలుకోలేదు. ఈ దుశ్చర్యకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించేందుకు అన్ని దర్యాప్తు సంస్థలూ ఎడతెగని కృషి చేస్తున్నాయి. ఇది యుద్ధక్షేత్రంలో శత్రువులతో జరుగుతున్న పోరు. అయితే- ఇంటింటికీ చేరుతున్న ఉగ్రవాదం- ‘సైబర్ ఉగ్రవాదం’. ప్రతి ఇంట్లో సైబర్ రూపంలో చేరుతున్న అశ్లీలం మానవ జీవిన సౌందర్యాన్ని వికృతం చేస్తోంది.

02/17/2019 - 00:15

ఆశనిరాశల కోలాహలమే అధికార పీఠం కోసం సాగే పోరాటం! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల హడావుడి లేని పరిస్థితి ఎప్పుడూ లేదు. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకూ అనునిత్యం ఎన్నికల వేడి ఎక్కడో అక్కడ రగులుకుంటూనే ఉంటుంది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ.. ప్రజలు ఎన్నుకునే ప్రతినిధుల ద్వారా సాగే పాలనా విధానం.

02/15/2019 - 22:03

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియడంతో అందరి దృష్టి మరో రెండు నెలలలో జరు గనున్న సార్వత్రిక ఎన్నికలపై పడింది. ఈ ఐదేళ్లు పార్లమెంటు సమావేశాలు ఎంతో ఫలప్రదంగా జరిగాయని తన ముగింపు ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేయగా, రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు వృథాగా జరిగాయని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

02/15/2019 - 01:10

మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలూ బడుగు వర్గాల వారిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పథకాలతో మేనిఫెస్టోలను రూపొందించడం ఆనవాయితీగా మారింది. మధ్యతరగతి ప్రజలు ఏనాడూ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన ఎన్నికలలో 65% మించి ప్రజలు ఏనాడు ఓటు హక్కును వినియోగించుకొనలేదు. ఈ బలహీనతను కనిపెట్టిన మన పాలకులు ఓటు హక్కు వినియోగంపై సర్వే చేయిస్తుంటారు.

02/14/2019 - 01:03

‘ఒక నిర్ణయం తీసుకునే ముందు, హామీ ఇచ్చేముందు, ఏదైనా పనిచేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించండి.. సమయం తీసుకున్నా ఫర్వాలేదు. ఒకసారి ఒక అంశంపై నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కు వెళ్లవద్దు..’ అని ప్రపంచ ప్రఖ్యాత నియంత అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథలో రాసుకున్నాడు.

02/13/2019 - 04:16

సమాచార హక్కు చట్టంలో సెక్షన్-26 ప్రకారం ఆ చట్టం ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ రోజురోజుకూ ఆ చట్టాన్ని అటకెక్కించే పనిలో అన్ని ప్రభుత్వా లూ పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్.

Pages