S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/22/2020 - 22:52

నూతన ఆర్థిక సంస్కరణల అమలుతో గత మూడు దశాబ్దాలుగా భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగినా, దేశంలో సంపద పెరుగుతున్నా, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు అనేక రెట్లు పెరుగుతున్నా గ్రామీణ, వ్యవసాయ రంగాలు మాత్రం శిథిలావస్థకు చేరుకొం టున్నాయి. ఆ రంగాలలో జీవం నింపే ప్రయత్నాలు చెప్పుకోదగిన విధంగా జరగడం లేదు.

03/19/2020 - 05:09

విశ్వమంతా కరోనా భయంతో వణికిపోతుంటే, దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలు కరోనాను కేంద్రంగా చేసుకుని విమర్శలు చేసుకుంటున్నాయి. కరోనా సృష్టిస్తున్న విధ్వంసం కొనసాగుతోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్, అమరావతి వరకు అన్ని ప్రభుత్వాలు శక్తివంచనలేకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాయి.

03/18/2020 - 23:41

యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో కూడా ఎన్నడూ ప్రపంచం ఇంతలా మూతపడలేదు. ప్రపంచంలోని 150కి పైగా దేశాలు కరోనా వైరస్ వ్యాధి బారిన పడి విలవిలలాడుతున్నాయి. కేవలం దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాలు, గ్రీన్ లాండ్, ఆర్కిటిక్ ప్రాంతం మినహాయిస్తే 195 దేశాలకూ కరోనా సోకింది. వరల్డో మీటర్ లెక్కల ప్రకారం 1,82,725 మందికి ఈ వ్యాధి పాజిటివ్‌గా వచ్చింది. ఇంత వరకూ 7174 మంది మరణించారు.

03/16/2020 - 23:43

2019లోనే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి వుండగా వివిధ కారణాలతో, ముఖ్యంగా రిజర్వేషన్ల సమస్యతో వాయిదాపడుతూ వచ్చాయి. జగన్‌గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలలకు, ముఖ్యమంత్రి చొరవతో, కోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 4 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

03/14/2020 - 23:12

భారత రాజకీయాలలో హిందుత్వ సైద్ధాంతిక ప్రాతిపదికతో బలమైన రాజకీయ ప్రత్యా మ్నాయం ఏర్పాటుకు అవిరళ కృషిచేసిన మేధావి, విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు, వీరోచిత పోరాట యోధుడు ప్రొఫెసర్ బలరాజ్ మధోక్. విదేశీ సైద్ధాంతిక ఆలోచనలు భారత రాజకీయ రంగాన్ని ముంచి వేస్తున్న రోజులలో ప్రత్యామ్నాయ సామాజిక, రాజకీయ, ఆర్థిక విలువలతో బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటుకు విఫల ప్రయత్నం చేశారు.

03/12/2020 - 06:00

నాయకుడికి పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండాలే కాని, ఎటువంటి ఆర్థిక మాంద్యా లు సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకోలేవు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారు. 2020-21 వార్షిక బడ్జెట్‌ను చూస్తే సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా రాజీపడినట్లు కనపడలేదు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన అనేక పోరాటల తర్వాత ఆవిర్భవించింది.

03/11/2020 - 21:54

రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు.

03/08/2020 - 22:47

ఇటీవల భారీ మెజారిటీతో మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్‌పై గతంలోకంటే బాధ్యతలు పెరిగాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని పది రోజులు కాకముందే రాజధాని నగరంలో పలు హింసాత్మక సంఘటనలు జరగడం బాధాకరం.

03/07/2020 - 23:56

తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నది. మీడియా సమావేశాలకు, కొన్ని గోడల మధ్య జరిగే సమావేశాలు జరపడం తప్పా జనం మధ్యకు వెళ్లి పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను ఉత్తేజ పరచే నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఎక్కడకు వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నది. జనసంఘ్ రోజులలో కూడా ఇంత దుస్థితిలో పార్టీ లేకపోవడం గమనార్హం.

03/05/2020 - 02:50

సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్ షా కందహార్, లాహోర్, సింధ్ ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, ఢిల్లీకి సమీపంలోని కర్నాల్ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక ఢిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్ షా మార్చి 22వ తేదీన రక్తపాతం సృష్టించాడు.

Pages